
'మగధీర' ప్రదర్శిస్తున్న థియేటర్లలో చిన్న టిక్కెట్ నుంచి పెద్ద టిక్కెట్ వరకూ కొని చూసే ప్రేక్షకులు కూడా ఈ ఛారిటీ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారనీ, ఆదివారం కూడా కావడంతో ఈ చిత్రాన్ని మరింత ఎక్కువ మంది చూసి వరద బాధితులకు తమ వంతు సహాయం అందించాలని ఆయన ప్రేక్షకాభిమానులను కోరారు. రాష్ట్రంలో వచ్చిన వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు చిత్ర పరిశ్రమ ఇతోథికంగా ఆదుకుంటోందనీ, 'మగధీర' తరఫున తమ వంతు బాధ్యతగా ముందుకు వచ్చామనీ చెప్పారు. చిత్ర పరిశ్రమ నుంచి మొదటిగా 10 లక్షల సహాయాన్ని సిఎం రిలీఫ్ ఫండ్ కు అందించిన క్రెడిట్ కూడా ఈ చిత్ర కథానాయకుడు రామ్ చరణ్ కు దక్కుతుంది.
No comments:
Post a Comment