
ఇక సాయిరాం శంకర్ కథానాయకుడుగా వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్ నిర్మించిన చిత్రం 'బంపర్ ఆఫర్'. పూరీ జగన్నాథ్ శిష్యుడు జయ రవీంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సాయిరాంకు జోడిగా బిందు మాధవి నటించింది. వైష్ణో అకాడమీ బ్యానర్ పై గతంలో వచ్చిన 'ఇడియట్', 'అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి', 'పోకిరి' వంటి హిట్ చిత్రాల తరహాలోనే ఈ చిత్రం కూడా బంపర్ హిట్ అవుతుందని ఫిల్మ్ మేకర్స్ చెబుతున్నారు. అయితే ఇంతవరకూ హీరోగా సరైన సక్సెస్ లు లేని సాయిరాం కు ఈ చిత్రం హిట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే గాయకుడు రఘుకుంచెం తొలిసారిగా సంగీత దర్శకుడుగా మారి ఈ చిత్రానికి అందించిన ఆడియో మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కావాలసి ఉన్నప్పటికీ కారణాంతరాల వల్ల 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి...కల్యాణ్ రామ్ వెర్సస్ సాయిరాంలో ఏ 'రామ్' విజయకేతనం ఎగుర వేస్తారనేది ఈ వారాంతంలోనే తేలనుంది.
No comments:
Post a Comment