
సునీల్ కుమార్ రెడ్డి ఆ విశేషాలను తెలియజేస్తూ, అక్టోబర్ 29న ప్రారంభమైన ప్రతిష్టాత్మక ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో 56 దేశాల నుంచి 200 చిత్రాలు ఎంపికయ్యాయనీ, అందులో తెలుగు నుంచి ఎంపికైన ఏకైక చిత్రం 'సొంత ఊరు' అనీ చెప్పారు. శ్యామ్ బెనగల్ చైర్మన్ గా వ్యవహరించిన ఈ పెస్టివల్ లో ప్రదర్శించిన తమ చిత్రానికి అరుదైన ప్రశంసలు వచ్చాయనీ, తమిళ డైరెక్టర్ చేరన్ ('ఆటోగ్రాఫ్' ఫేమ్) తమ సినిమా చూసి ఎల్బీ శ్రీరామ్, తీర్ధ, రాజాల నటనను ప్రశంసించారానీ, థాయ్ లాండ్ ఫిల్మ్ కో-ఆర్డినేటర్ లేఖా శంకర్, పలు చలనచిత్రోత్సావాలకు కోఆర్డినేటర్ గా వ్యవహరించిన ఉమ డా కున, గ్రీస్ నిర్మాత జేమ్స్ మింకోస్ తదితరులు తమ ఇంటర్వ్యూలలో ఈ చిత్రాన్ని ప్రశంసించారనీ తెలిపారు. ఈ సినిమాను ఆడియెన్స్ కు పి.సునీల్ కుమార్ రెడ్డి పరిచయం చేయగా, సినిమా మేకింగ్, టెక్నాలజీ వంటి అంశాలను డిజిక్వెస్ట్ ఇండియా సిఇవో కె.బసిరెడ్డి వివరించారు. ఈ సినిమా తరఫున తీర్థ, ఛాయాగ్రాహకుడు సాబు జేమ్స్, నిర్మాత రవీంద్రబాబు కూడా హాజరయ్యారు.
No comments:
Post a Comment