
తొలిసారి చిత్ర విశేషాలను దర్శకుడు రవిబాబు తెలియజేస్తూ, ఇదొక థ్రిల్లర్ అనీ, కథ-కథనాలు ఆసక్తికరంగా ఉంటాయనీ చెప్పారు. చిత్రీకరణ కూడా చాలా వైవిధ్యంగా ఉంటుందనీ, 'అనసూయ', 'నచ్చావులే' చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉంటుందనీ అన్నారు. ఇందులో తాను కూడా ఓ కీలక పాత్ర పోషించినట్టు తెలిపారు. పాటలనేవే సినిమాలో ఉండవనీ, అయితే రీరికార్డింగ్ వెన్నుదన్నుగా నిలుస్తుందని అన్నారు. నిర్మాత ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ, ఆధునిక సినిమాకి సరికొత్త నిర్వచనం చెప్పగల దర్శకుడు రవిబాబు అనీ, ఈ చిత్రం హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతిని కలిగిస్తుందనీ చెప్పారు. ఇప్పటికే థియేటర్ ట్రైలర్స్ కు మంచి స్పందన వస్తోందన్నారు. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోందనీ, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ మొదటివారంలో సినిమా విడుదల చేస్తాని చెప్పారు. ఈ చిత్రంలో గద్దె సింధూర, కోట శ్రీనివాసరావు, పరుచూరి గోపాలకృష్ణ, విశ్వనాథ్ కాశీ, రాఘువ, మధు తదితరులు నటించారు. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, నారాయణ రెడ్డి ఆర్ట్, శంకర్ ఎడిటింగ్, శేఖర్ చంద్ర సంగీతం అందించారు
No comments:
Post a Comment