
ప్రముఖ నటుడు పద్మశ్రీ మోహన్ బాబు, సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ఈ చిత్రం చూసి ప్రత్యేకంగా అభినందించారనీ, ఇంతవరకూ ఎవరకూ తెరకెక్కించని సాయిబాబా జీవితంలోని యదార్ధ సంఘటనలను ఈ చిత్రంలో తాము పొందుపరిచామనీ ఆయన చెప్పారు. ఈనెల 19న ఆంధ్ర రాష్ట్రమంతా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ, పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ చిత్రం ప్రివ్యూ చూసి ప్రశంసించడం ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్యంగా సెకెండాఫ్ చూసి పలువురు కంట తడి పెట్టారనీ చెప్పారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని తప్పక అదిరించి, ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ఉన్నట్టు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుమన్, శివకృష్ణ, నాగబాబు, నారాయణరావు, బ్రహ్మాజీ, రఘునాథరెడ్డి, రామిరెడ్డి, గుండు హనుమంతరావు, చిట్టిబాబు, రమాప్రభ, శివపార్వతి తదితరులు నటించారు. సుద్దాల అశోక్ తేజ, తైదలబాబు, డాక్టర్ పరిమి రామ నిర్సింహం పాటలు, శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ, మేనఘ శ్రీను ఎడిటింగ్, లలిత్ సురేష్ సంగీతం అందించారు
No comments:
Post a Comment