
రామ్ చరణ్ కథానాయకుడుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన 'మగధీర' చిత్రం సంచలన విజయం సాధించి కలెక్షన్ల సునామీ సృష్టించిది. భారత సినీ చరిత్రలోనే 'గజనీ' తర్వాత అత్యధిక కలెక్షన్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. 60 కోట్లకు పైగా ఈ చిత్రం రాబట్టింది. ఇంతవరకూ ఉన్న అర్ధ శతదినోత్సవ రికార్డులను కూడా బ్రేకే చేసి 302 కేంద్రాల్లో 'మగధీర' ఆమధ్య హాఫ్ సెంచరీ చేసుకుంది. తాజాగా రికార్డు సెంటర్లలో సెంచరీకి కూడా ఈ చిత్రం దగ్గరవుతోంది. 'పోకిరి' చిత్రం 200 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోగా, 'మగధీర' చిత్రం ఈనెల 7వ తేదీతో 223 సెంటర్లలో వందరోజులు పూర్తి చేసుకోనుంది. 'పోకిరి' రికార్డులు తిరగరాయడం సాధ్యం కాదని పలువురు వేసిన అంచనాలకు 'మగధీర' చెక్ పెట్టనుంది
No comments:
Post a Comment