Thursday, October 8, 2009

ఫైనల్స్ లో ఎన్టీఆర్ ఫిల్మ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం హైద్రాబాద్ లో చివరి షెడ్యూల్ జరుపుకొంటోంది. కొడాలి నాని సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ ప్రోగ్రస్ ను చిత్రయూనిట్ గురువారంనాడు తెలియజేసింది.

వినాయక్ మాట్లాడుతూ, తారక్ (ఎన్టీఆర్) తో తాను చేస్తున్న మూడో సినిమా ఇదనీ, తారక్ ఇమేజ్ కు తగ్గట్టుగా అన్ని వర్గాలనూ ఆకర్షించే కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోందనీ చెప్పారు. తమ కాంబినేషన్ లో వస్తున్న మరో సెన్సేషన్ ఫిల్మ్ ఇదని తెలిపారు. ఏకథాటిగా నెలాఖరు వరకూ జరిగే ఈ షెడ్యూల్ తో ఒక పాట మినహా షూటింగ్ పూర్తవుతుందని వంశీమోహన్ చెప్పారు. ఎన్టీఆర్-వినయ్ (వినాయక్) కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ ఫిల్మ్ అవుతుందనీ, డిసెంబర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామనీ అన్నారు. చాలా హై రేంజ్ లో తీస్తున్న చిత్రమిదనీ, ఎన్టీఆర్-వినాయక్ కాంబినేషన్ లో ఓ ల్యాండ్ మార్క్ ఫిలిమ్ అవుతుందనీ కొడాలి నాని తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా నయనతార, మరో కథానాయికగా షీలా నటిస్తున్నారు. మహేష్ మంజ్రేకర్, సాయాజీ షిండే, నాజర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, రఘుబాబు, తనికెళ్ల భరణి, రమాప్రభ, సుధ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ-మాటలు, చంద్రబోస్ పాటలు, ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, ఆనంద్ సాయి కళాదర్శకత్వం, స్టన్ శివ-రామ్ లక్ష్మణ్ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

No comments:

Post a Comment