
నాలుగేళ్ల క్రితం తాను చేసిన ఆల్బమ్ లోని పాట ఇదనీ, తన పాటలో నాలుగు చరణాలు ఉంటాయనీ, ఇందులోని రెండు చరణాలను 'మహాత్మ' చిత్రంలో ఉపయోగించుకున్నారని, ఇది కాపీ రైట్ ఉల్లంఘన కిందకు వస్తుందనీ అవుదూరి లక్ష్మణ్ తన పిటిషన్ లో పేర్కొన్నట్టు సమాచారం. కోట్లాది రూపాయల వ్యాపారం చేసే నిర్మాతలు ఇలాంటి చౌర్యానికి పాల్పడటం, కనీసం తన పేరు కూడా ఇవ్వకపోవడం ఆక్షేపణీయమని ఆయన పేర్కొన్నారు. ఇటీవల 'మగధీర' చిత్రంలోని ఓ పాట పల్లవి తనదేనంటూ వంగపండు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో 'మహాత్మ' సైతం ఇలాంటి అభియోగాన్నే ఎదుర్కొంటుండటం చర్చనీయాంశమవుతోంది. అసలే ఒకసారి విడుదల వాయిదా పడి...ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వరద బాధిత పరిస్థితుల తరుణంలో విడుదలకు సిద్ధమవుతున్న 'మహాత్మ' తాజా పరిస్థితులను ఏ విధంగా తట్టుకుంటుందనేది చూడాలి
No comments:
Post a Comment