skip to main |
skip to sidebar
అల్లు శిరీష్ 'సౌత్ స్కోప్'
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ సి.ఇ.వో.గా దక్షిణాది మ్యాగజైన్ 'సౌత్ స్కోప్' సినీ అభిమానుల ముందుకు వచ్చింది. ఈ మ్యాగజైన్ లో దక్షిణాదికి చెందిన నాలుగు భాషా చిత్రాల విశేషాలను ఆంగ్లంలో అందించనున్నారు. ఇండియాలోనే తొలి దక్షిణాది ఫిల్మ్ మ్యాగజైన్ అయిన 'సౌత్ స్కోప్'ను చెన్నైలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో లాంఛనంగా ఆష్కరించారు. కమల్ హాసన్, రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, విక్టరీ వెంకటేష్, శరత్ కుమార్, అల్లు శిరీష్ తదితరులు ఒకే వేదికపైకి వచ్చి ఈ మ్యాగజైన్ ను ఆవిష్కరించడం విశేషం.
No comments:
Post a Comment